Monday, 19 February 2018

Is there end to Christianity?

క్రైస్తవులు,నక్షత్రం చేప

నక్షత్రం చేప భుజాల్లో ఒకటి తెగిపోతే ఆ స్థానంలో మరో భుజం పుట్టుకొస్తుందని మీకు తెలుసా?నిజానికి నక్షత్రం చేపను రెండు ముక్కలుగా కోసినా దాని కేంద్రీయ నాడి ఉన్న ముక్క మళ్ళీ మరో చేపగా పెరుగుతుంది.

           ముత్యపు చిప్పలు వేటాడే కొందరు జాలరులు ఈ విషయం కనిపెట్టారు.ముత్యపు చిప్పలు దొరికే ప్రాంతమంతా నక్షత్రం చేపలతో నిండిపోవడం వారిని అసహనానికి గురి చేసింది.ఈ జాలరులు వాటిని ముక్కలుగా కోసి తిరిగి నీటిలో పడవేశారు.అయితే అవి నాశనం కాలేదు సరికదా ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాయి.

   శతాబ్దాలుగా అనేక దేశాల్లో క్రైస్తవులను ద్వేషించి వ్యతిరేకించి,హింసించారు.అయితే హింస క్రైస్తవులను నాశనం చేయలేకపోయింది.ఈ విపరీత పరిస్థితుల్లో క్రైస్తవ్యం కేవలం నిలిచి ఉండడం కాదు గానీ,ఎంతో అభివృద్ధి చెందింది.యేసు తన సంఘానికి ఇలా చెప్పారు "పాతాళ లోక ద్వారాములు దాని ఎదుట నిలువనేరవు" (మత్తయి 16:18)

   యేరుషలేములో మొదటి శతాబ్దపు క్రైస్తవులను తీవ్రంగా హింసించారు.కాని దీని ద్వారా వారు యూదయ,సమరయ దేశాల్లోకి చెదరిపోయారు.వారు వెళ్లిన ప్రతీ స్థలం'లోనూ సువార్త ప్రకటించారు.అనేకమంది యేసునందు విశ్వసించారు.ఆపో.కా.8:4-6 ఫిలిప్పు బోధింఛినప్పుడు అనేకమంది మారుమనస్సు పొందడం చూస్తాం.

అవును,ప్రభువైన యేసుక్రీస్తు సంఘం ఎంత తీవ్రమైన హింస పొందినప్పటికీ అది అభివృద్ధి చెందుతూనే ఉంది. పాతాళ లోక సైన్యములు దాని ముందు నిలువనేరవు.

    🔪హతసాక్షులు చిందించిన రక్తం సంఘానికి విత్తనం🌾

Source: Bro.Jim Joseph K (Facebook)
Messiah Gospel Service
https://www.youtube.com/channel/UCM8Azd_X1XThdQnM-PjajRw

No comments:

Post a Comment